జగన్ ఆధ్వర్యంలోని ఏపీ ప్రభుత్వం నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలలో యూపీఐ పేమెంట్స్ ను ప్రవేశపెట్టే దిశగా నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రోజు ఎన్పిసిఐ తో పాటు… రాష్ట్ర ప్రభుత్వం తో అనుసంధానం అయినా కెనరా బ్యాంకు వారు కలిసి దీనిపై ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల్లో ఇకపై అన్ని పేమెంట్లు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ మీడియం ద్వారా బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు చెల్లించే విధంగా గా ఒక ప్రక్రియ చేపట్టారు.
అందుకు సంబంధించిన ఈవెంట్ కెనరా బ్యాంకు వారి ఆధ్వర్యంలో జరుగుతుండగా… అందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, కెనరా బ్యాంక్ సీఈవో, ఎండీ ప్రభాకర్, ఎన్పిసిఐ సీఈఓ దిలీప్, ఎన్పిసిఐ సీఓఓ ప్రవీణ రాయ్ పాల్గొననున్నారు.