ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సీఎం యొక్క ఆఫీస్ లో ఒక కరోనా పాజిటివ్ కేసు బయటపడటంతో మొత్తం ఆఫీస్ నే మూసేశారు. అయితే తెలంగాణతో పోలిస్తే అత్యధిక మొత్తంలో టెస్టులు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సచివాలయంలో కూడా సుమారు పది మందికి కరోనా పాజిటివ్ రాగా జగన్ ఈ విషయమై కొన్ని కీలకమైన ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 11వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది… సెక్రటేరియట్లో కేబినెట్ భేటీకి వీలు ఉంటుందా? ఉండదా? అనే దానిపై అనుమానాలు ఉన్నాయి. సచివాలయంలో సుమారు 10 మందికి కరోనా సోకగా…. కేబినెట్ భేటీపై సచివాలయ వర్గాల్లో చర్చ జరిగింది. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా వైరస్ అందరికీ పాకుతుంది అనే ఆలోచన తో జగన్ వేరే చోట సమావేశ ఏర్పాట్ల ని చూడామణి అధికారులని ఆదేశించినట్టు టాక్ నడుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది
ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా సెక్రటేరియట్ లో కేబినెట్ భేటీకి జగన్ మొగ్గు చూపకపోవడం వైసిపి ఎమ్మెల్యేలను ఆశ్చర్యపరిచింది. మరి రాష్ట్రం మొత్తానికి ప్రెస్ మీట్ లో జాగ్రత్తలు చెప్పే తాను తగిన జాగ్రత్తలు తీసుకొని తన పర్యవేక్షణలో ఎవరు ఏమాత్రం ఉదాసీనంగా వ్యవహరించకుండా చూస్తూ సీఎం గారే ఆదర్శంగా నిలవకపోతే ఎలా?