అమరావతి, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా నుండి అక్రమంగా ఓట్ల తొలగింపులు, అవకతవకలు జరిగాయంటూ వాటిపై చర్యలు తీసుకోవాలని వైసిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్కు కోరారు.
హైదరాబాదు రాజ్భవన్లో శనివారం నరసింహన్ను జగన్మోహనరెడ్డి కలిశారు. గంటకు పైగా ఆయన గవర్నర్తో భేటీ అయ్యారు. పోలీస్ అధికారుల నియామకాల్లో, పదోన్నతుల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన ఫిర్యాదు చేశారు.
ఆయన వెంట వైసిపి నేతలు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే డిజిపి ఠాకూర్, ఇంటిలిజెన్స్ డిజి వెంకటేశ్వరరావు, డిఐజి ఘట్టమనేని శ్రీనివాసరావులను ఎన్నికల విధుల నుండి తప్పించాలని ఇటీవల జగన్ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈసి) సునీల్ అరోరాను ఢిల్లీలో కలిసి కోరారు.