ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయం కు సంబంధించి మరొక కీలక అడుగు వేశారు. పి.ఎమ్.యు కాల్ సెంటర్ ప్రారంభించిన వైఎస్ జగన్ దీనిద్వారా యంత్రాంగంలో ఎక్కడ దరఖాస్తు ఆగినా అప్రమత్తం చేయాలని సూచించారు. సచివాలయంలో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసేలా మరియు కొత్త సచివాలయం నిర్మాణం, అర్బన్ హెల్త్ క్లినిక్ పై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
సెప్టెంబరు లోగా సచివాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులకు పరీక్షలు నిర్వహించాలని చెప్పిన జగన్ నిర్దేశిత సమయంలో వినతుల పరిష్కారంపై పి.ఎమ్.యు సెంటర్ ను ప్రారంభించినట్లు తెలిపారు. పర్సుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్ అని పిలువబడే దీనికి మొదటగా నాలుగు సర్వీసులు ప్రారంభించి అక్టోబర్ నుండి 543 కి పైగా సేవలు అమలు చేయనున్నారు.
అలాగే ఫంక్షనల్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులను సచివాలయం తో అనుసంధానం చేశారు. మారుమూల ప్రాంతాల్లోని సచివాలయాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీలు…. మార్గదర్శకాలను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఇంటర్నెట్ లేని 512 సచివాలయాలను అనుసంధానం చేయనున్నారు.
ఇందులో 213 సచివాలయాల్లో ఇప్పటికే హైస్పీడ్ ఇంటర్నెట్ ఏర్పాటు చేశారు. మిగిలిన సచివాలయాల్లో వచ్చే రెండు నెలల్లో ఇంటర్నెట్ ను అనుసంధానిస్తామని అధికారులు వైఎస్ జగన్ కు ఈ రకంగా వివరించారు. ఇక సచివాలయంలో ఏర్పాటు చేయనున్న డిజిటల్ బోర్డు ద్వారా ప్రభుత్వ పథకాలు మార్గదర్శకాలు అందుబాటులో ఉంచాలన్నారు.
అలాగే సచివాలయంలోని ఉద్యోగులకు, వాలంటీర్లకు ప్రభుత్వ పథకాల పై పూర్తి అవగాహన ఉండాలని ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు అక్రమాలపై గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్నారు. తాజాగా బయటకు వచ్చిన ల్యాండ్ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన షెడ్యూల్ ప్రకటించాలని…. ఆ షెడ్యూల్ను తనకు నేరుగా నివేదించాలని సీఎం సూచించటం గమనార్హం.