NewsOrbit
న్యూస్

నేరుగా వాళ్ల ఖాతాలోకే ! జగన్ డేరింగ్ నిర్ణయంతో ఉలిక్కిపడ్డ ‘డబ్బునోళ్లు’!!

జగన్ ప్రభుత్వం విద్యార్థుల ‘ఫీజు రీయింబర్సుమెంట్’ నగదుని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమచేయాలని తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైందని ప్రశంసల వర్షం కురుస్తోంది.

jagan daring decission direct to your accounts
jagan daring decission direct to your accounts

ఈ నిర్ణయం కారణంగా పేద విద్యార్థులకు, ప్రత్యేకించి ఎస్సి, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్నిరకాల వేధింపులనుండి విముక్తి కలిగిస్తుంది.జగన్ తండ్రి ,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు కూడా పెద్ద పెద్ద చదువులు అందుబాటులోకి రావాలన్న లక్ష్యంతో ఈ ఫీజురియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే.1990 దశకంలో విస్తృతంగా వచ్చిన ఇంజనీరింగ్ మరియు మెడికల్ కళాశాలల్లో ఇంజనీరింగ్, మెడికల్ విద్య అందని ద్రాక్షగానే మిగిలింది.ఇంటర్ తర్వాత పేద కుటుంబాల పిల్లలు సాంప్రదాయ కోర్సులకు పరిమితమైన రోజుల్లో డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్ పధకం ప్రవేశపెట్టారు.

ఈ పథకంతో రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ మరియు మెడికల్ కళాశాలలు పేదల పిల్లలకు మొదటిసారిగా ద్వారాలు తెరిచాయి. పెద్ద సంఖ్యలో పేదల పిల్లలు ఇంజనీరింగ్, మెడికల్ విద్య మొదలుపెట్టారు. సమస్య ఇక్కడే మొదలయింది. విద్యార్థులకు అడ్మిషన్స్ ఇచ్చిన కొన్ని కార్పొరేట్ కళాశాలలు ‘ఫీజు రీయింబర్సుమెంట్’ దరఖాస్తులన్నీ పూర్తయ్యాక, లేదా ప్రభుత్వం నుండి నేరుగా ‘ఫీజు రీయింబర్సుమెంట్’ సొమ్ము తమ ఖాతాలో పడిన తర్వాత అసలు సమస్య మొదలయ్యేది.ఫీజు రీయింబర్స్మెంట్ పొందిన విద్యార్థులను కళాశాల యాజమాన్యాలు ,తోటి డబ్బున్న విద్యార్థులు చులకనగా చూసేవారు… అవమానించే వారు… ర్యాగింగ్ చేసేవారు… రకరకాలుగా ఇబ్బందులు పెట్టేవారు. కళాశాల యాజమాన్యాలు అదనపు ఫీజులు అడిగేవి. చదువుపై ఇష్టంతో ఈ కష్టాలన్నీ భరించే వారు.

ఇంకొందరు కాలేజీ మానేసేవారు. ఇంకో కాలేజీలో చేరాలంటే సదరు విద్యార్థి సర్టిఫికెట్లు ఇచ్చేవారు కాదు. ఇది అన్ని చోట్లా జరిగిందని కాదు. చాలా చోట్ల జరిగింది. అయితే ఇవన్నీ లోలోపలే జరిగిపోయేవి కాబట్టి చాలామందికి ఫీజురియంబర్స్మెంట్ పొందిన విద్యార్థుల అవస్థలు తెలిసేవి కావు ఇలాంటి అవమానాలు వేధింపులు తట్టుకోలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా జరిగాయి.మొత్తంమీద ఇవన్నీ ఎలాగో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వచ్చాయి దీంతో ఆయన కళాశాల యాజమాన్యాలకు కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజురియంబర్స్మెంట్ నగదు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు ఇందువల్ల కళాశాల యాజమాన్యాలు తప్పనిసరిగా ఫీజు రియంబర్స్మెంట్ పొందిన విద్యార్థులను గౌరవించాల్సి వుంటుంది

ఎందుకంటే ఇప్పుడు ఫీజు డబ్బు విద్యార్థుల దగ్గర ఉన్నది వారికి అవమానాలు జరిగితే ఆ కళాశాలలో కూడా ఉండకుండా వెళ్లిపోయే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది .దీనివల్ల నష్టం కళాశాల యాజమాన్యానికి కాబట్టి వారు ఇక బుద్ధిగా ఫీజురియంబర్స్మెంటు పొందిన విద్యార్థులను గౌరవంగా చూస్తారనడ౦ లో సందేహం లేదు!అందుకే ముఖ్యమంత్రి జగన్ కి అన్ని వర్గాల పేద విద్యార్థుల నుండి అభినందనలు అందుతున్నాయి .

author avatar
Yandamuri

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju