జగన్ అధికారంలోకీ వచ్చి ఏడాది అయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన కానుక… గత ప్రభుత్వంలో ప్రజలు పడిన ఇబ్బందులకు కారణమైన అవినీతిపై ఉక్కుపాదం మోపబోతున్నానని శాంపుల్ ఇవ్వడం! ఆ శాంపుల్ పీస్ గా అచ్చెన్నను అరెస్టు చేయడం అని భావిస్తే… అనంతరం వరుసగా జేసీ ప్రభాకర్ రెడ్డి, కొల్లు రవీంద్రలు వరుసగా అరెస్టయ్యారు. అన్నీ అనుకూలంగా జరిగితే… నెక్స్ట్ మరో మూడు నాలుగు పేర్లు ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి… మరో నాలుగైదు రోజుల్లో వారికి కూడా “కన్ ఫాం” అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేతలు వాయిస్ పెంచేశారు… బీసీలపై దాడిగా అభివర్ణించారు! దీంతో తాజాగా వైకాపా నేతలు కూడా వాయిస్ పెంచేశారు!
ఈ క్రమంలో వరసగా తమ నేతలను తీసుకువచ్చి జైళ్ళల్లో పెట్టేస్తున్నారని, బీసీలను అణగదొక్కేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు గోల పెడుతున్న సంగతి తెలిసిందే. ఇది దారుణమని ఆయన గట్టిగానే మాట్లాడుతున్నారు. ఆ విధంగా జనంలో సానుభూతి పొందాలన్నది టీడీపీ స్ట్రాటజీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇలా వదిలేస్తే కరెక్ట్ కాదని భావించినq జగన్ & కో.. బాబుకు గట్టి రిటార్టులు ఇవ్వడం మొదలుపెట్టారు! అందులో భాగంగా… ట్రైలర్ అనే మాటలు మొదలెట్టేశారు!
దీనికే గగ్గోలు పెడితే ఎలా… ఇది జస్ట్ ట్రైలర్ మాత్రం… అనంతరం రాబోయే నాలుగేళ్లలో అవిరామంగా గ్రాఫిక్స్ లేని యాక్షన్ మూవీ కనువిందు చేయబోతుంటే… అన్నట్లుగా జగన్ బ్యాచ్ నుంచి బలమైన సౌండ్స్ వస్తున్నాయి! ఈ క్రమంలో… గతంలో తమరు చేసిన పాపాలే నేడు శాపాలుగా మారాయే తప్ప ఇందులో వైకాపా ప్రభుత్వం వచ్చాక కొత్తగా చేసిందేమీ లేదని అంటున్నారు మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ అంటున్నారు.
దీంతో.. టీడీపీ నాయకులు చేసే ఆరోపణలకు, అరెస్టులపై ఆడుతున్న రాజకీయ ప్లేస్ కి జగన్ & కో నుంచి గట్టి కౌంటర్స్ స్టార్ట్ అయినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… “రాష్ట్రపతిని కలసి వినతిపత్రం ఇస్తే ఈ కార్యక్రమం ఆగిపోతుందనుకుంటే పొరపాటే…” అని కూడా జగన్ & కో క్లారిటీ ఇస్తోంది!!