ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్లో సీటు సంపాదించింది. హర్షారెడ్డి ప్రముఖ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చేయనుంది.
ఈ బిజినెస్ స్కూల్ కు యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆసియా, నార్త్ అమెరికా వంటి చోట్ల బ్రాంచిలున్నాయి. హర్షారెడ్డి పారిస్ క్యాంపస్ లో మాస్టర్స్ చేయనున్నారు.ఆమె ఈ మంగళవారమే పారిస్ పయనమవ్వనున్నారు. ఆమెను పారిస్ పంపేందుకుగాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం బెంగళూరు పయనమవ్వనున్నారు.
ముందునుండీ హర్షారెడ్డి చదువులో ముందంజలో ఉండేవారు. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. అంతటి ప్రముఖ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంపై ప్రముఖులు ఆమెను అభినందించారు. ఇక ఇప్పుడు ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు సాధించి ఆమె మరో స్థాయిని అందుకున్నారు.