ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…. తన తండ్రి అయిన దివంగత నేత మరియు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క పుట్టినరోజు నాడు చాలా ఎమోషనల్ అయిపోయారు.
ఇప్పటికే వైఎస్ఆర్ సతీమణి విజయలక్ష్మి ‘వైఎస్ బయోగ్రఫీ’ ని పుస్తకం రూపంలో విడుదల చేయగా జగన్…. రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు ని ‘రాష్ట్ర రైతు దినోత్సవం’ గా ప్రకటించారు. ఇక ఇదే సమయంలో తన తండ్రి గారిని తలుచుకుంటూ జగన్ ఒక ట్వీట్ వేశారు.
“నాన్న గారి 71వ జయంతి నేడు. ఆయన మరణం లేని మహానేత. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే. రైతుపక్షపాతి అయిన మహానేత జయంతిని రైతుదినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది,” అని జగన్ పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?