ఆంధ్రప్రదేశ్ శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు వాడివేడిగా జరిగాయి. రైతు సమస్యల గురించి మాట్లాడుతూ చంద్రబాబు తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కుండపోత వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో రణరంగం సృష్టించారు. అంతే కాకుండా ఏకంగా పోడియం వద్దకు వచ్చి నేల మీద భైఠాయించి నిరసన కూడా తెలపడం జరిగింది.
ఇదిలా ఉంటే చంద్రబాబు వ్యవహరించిన తీరుపై ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షంలో నేను పోరాడ గాని ఈ విధంగా పోడియం వద్దకు ఎన్నడూ రాలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ఎప్పుడు ఎక్కడ వరదలు వచ్చినా రోడ్డు మీద అయినా సరే నడిచి వెళ్లి బాధితులను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగిందని చెప్పిన జగన్.. దాదాపు చంద్రబాబు 8 నెలల పాటు హైదరాబాదులో ఉంటే ఇప్పుడు అసెంబ్లీలో రైతుల గురించి మొసలి కన్నీరు కార్చడం చాలా విడ్డూరంగా ఉంది అన్నట్టు కామెంట్లు చేశారు.
CBN అంటే చంద్రబాబు నాయుడు కాదు కరోనాకు భయపడే నాయుడు అంటూ సరికొత్త అర్థం చెప్పుకొచ్చారు జగన్. చంద్రబాబు పెద్ద డ్రామా నాయుడు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎందుకు ఈ విధంగా రెచ్చిపోతున్నారో ఎవరికి అర్థం కావటంలేదు అసలు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది అనే వ్యక్తి ఈ విధంగా వ్యవహరించటం దారుణమని జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మంచి చేస్తున్న నేపథ్యంలో వేరే విధంగా ప్రభుత్వాన్ని చిత్రీకరించడానికి చంద్రబాబు అనేక డ్రామాలాడుతున్నారు అంటూ అసెంబ్లీలో జగన్ మండిపడ్డారు.