YS Jagan: వైయస్ జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుండి.. పాదయాత్ర టైంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా రాష్ట్రానికి ఆదాయం పెద్దగా లేకపోయినా గాని సంక్షేమం ఎక్కడ ఆగిపోకుండా పేదలను ఆదుకుంటూ వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తూ ఉంది. ఈ తరుణంలో ఇప్పటికే పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా చేయటం తెలిసిందే. ఇటువంటి తరుణంలో తాజాగా ఒక్క రూపాయికే పేదలకు టిడ్కో ఇల్లు జగన్ ప్రభుత్వం ఇవ్వటానికి రెడీ అయినట్లు తాజాగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
రెండు లక్షల 60 వేలకు పైగానే టిడ్కో ఇళ్ళు
రానున్న 18 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా.. టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రెండు లక్షల 60 వేలకు పైగానే టిడ్కో ఇళ్ళు… పూర్తయినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల విషయంలో పేదల వద్ద డబ్బు కట్టించుకుని మోసం చేయడం జరిగిందని… ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆపేసింది అని ఆరోపించారు. అటువంటి ఇళ్లను… జగన్ అధికారంలోకి వచ్చాక పూర్తి చేయడం జరిగిందని ఈ క్రమంలో ఒక రూపాయికి టిడ్కో ఇళ్ళు.. ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
పేదలపై భారం పడకుండా
పేదలపై భారం పడకుండా ఏడు వేల కోట్లను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లా భగత్ సింగ్ నగర్ లో టిడ్కో..ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో… మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లో పాల్గొన్న బొత్స సత్యనారాయణ.. ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజా సంకల్ప పాదయాత్రలో అదే రీతిలో 2019 ఎన్నికల ప్రచారంలో దాదాపు ప్రతీ చోట వైయస్ జగన్.. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన వెంటనే.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా జగన్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ తరుణంలో న్యాయస్థానాల నుండి అనేక అడ్డంకులు రాగా వాటిని అధిగమించి మరీ.. పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడుతోంది జగన్ ప్రభుత్వం.