భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (ఎంబిబిఎస్), దంత విద్యా కోర్సులు (BDS) చదవాలనుకునే విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం జిఓ నెంబర్ 146 ను జారీ చేసింది. కరోనా నేపథ్యంలో ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సూచనల మేరకు ఫీజులు తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్, బిడిఎస్ విద్యనభ్యసించే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తగ్గిన ఫీజులతో భారీ ఊరట కలగనుంది.
ఎంబిబిఎస్, బిడిఎస్ ప్రవేశాలు నీట్ లో సాధించిన ర్యాంకు ఆధారంగా విద్యార్థులు తమకిష్టమైన కాలేజీ లో సీటు పొందే అవకాశం ఉంటుంది. నీట్ కింద మొత్తం సీట్ల సంఖ్య 66000.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎంబిబిఎస్, బిడిఎస్ ప్రదేశాలకి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. నోటిఫికేషన్ను రెండు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. నాలుగైదు రోజుల్లో తొలివిడత కౌన్సిలింగ్ ప్రారంభించనున్నారు. ఈ కోర్సు లకి ఎ,బి,సి కేటగిరి ఫీజులు ఖరారు చేస్తూ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సూచనల మేరకే నిర్ణయించినట్లు తెలిపారు. గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం బి, సి కేటగిరి ఫీజులు తగ్గాయన్నారు. ఈ కొత్త ఫీజులు 2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరం వరకు అమలులో ఉంటాయన్నారు. ఈ కోర్సులు ప్రవేశాల ప్రక్రియ రెండు విడుదల కౌన్సిలింగ్ లో పూర్తి చేస్తామన్నారు. ఈ నెలలో మొదటి కౌన్సిలింగ్ వచ్చే నెల మొదటి వారంలో రెండో కౌన్సిలింగ్ ను చేపట్టనున్నామని వివరించారు.
ఫీజుల వివరాలు:
►ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కింద రూ.15వేలు ఫీజు
►బి కేటగిరీ (మేనేజ్మెంట్) కోటా కింద రూ.12లక్షల ఫీజు
►ఎంబీబీఎస్ కోర్సులో బి కేటగిరీకి 6.8లక్షల వరకు ఫీజు తగ్గింపు
►సి కేటగిరీ (ఎన్ఆర్ఐ) కోటా కింద రూ.36లక్షల ఫీజు
►ఎన్ఆర్ఐ కోటాలో రూ.16లక్షల వరకు ఫీజు తగ్గింపు
►బీడీఎస్ కోర్సు కన్వీనర్ కోటా కింద రూ.13వేలు ఫీజు
►బీడీఎస్- బి కేటగిరీ (మేనేజ్మెంట్) కోటా కింద రూ.4 లక్షల ఫీజు
►బీడీఎస్ (మేనేజ్మెంట్) కోటాలో రూ.7లక్షల వరకు ఫీజు తగ్గింపు
►బీడీఎస్ – సి కేటగిరీ (ఎన్ఆర్ఐ) కోటా కింద రూ.12 లక్షల ఫీజు
►బీడీఎస్ (ఎన్ఆర్ఐ) కోటా కింద రూ.50 లక్షలకు పైగా ఫీజు తగ్గింపుతో ప్రైవేట్ వైద్య కళాశాలలో విద్యనభ్యసించే విద్యార్ధులకి భారీ ఊరట కలిగనుంది.