కష్టకాలంలో పార్టీలతో పని ఏంటి? ఎవరైనా ఒకటే కదా. ఆపదలో ఆదుకోవడమే కదా ప్రభుత్వం చేయాల్సిన పని. దానికి మన పార్టీ వాడా, అవతల పార్టీ వాడా అన్న బేధం చూడాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రస్తుతం అదే పని చేస్తోంది.
10 రోజుల క్రితం గజపతి నగరం రోడ్డులో ఒక జనసైనికుడికి దారుణమైన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వైజాగ్ మెడికవర్ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. పెద్ద ప్రమాదం కావడంతో చికిత్సకు ఎక్కువ మొత్తమే కావాల్సొచ్చింది. సహాయం కోసం జనసైనికులు ఎదురుచూస్తుంటే ఏపీ ప్రభుత్వ ప్రత్యేక అధికారి స్పందించారు. అతని కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామని ఆ ప్రత్యేక అధికారి భరోసా ఇచ్చారు. దాంతో జనసైనికులు ఊపిరి పీల్చుకున్నారు.