Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యా రంగంలో అనేక నూతన సంస్కరణలు తీసుకు రావడం తెలిసిందే. రాష్ట్రంలో చదువు ఎవరికీ భారం కాకుండా సంక్షేమ పథకాలతో విద్యార్థుల తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ విద్యార్థులకు.. ఉన్నత విద్య అందించే దిశగా పాఠ్యాంశాలు సరికొత్తగా చేర్చటం జరిగింది. ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ.. జగన్ ప్రభుత్వం విద్యార్థులు చిన్ననాటినుండే ప్రపంచంతో పోటీ పడే రీతిలో.. విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకు రావడం జరిగింది.
అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ “నాడు-నేడు” కార్యక్రమం చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ.. రూపురేఖలు మార్చారు. అదేవిధంగా “జగనన్న గోరుముద్ద” అనే పథకం ద్వారా పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించే కార్యక్రమం కూడా చేపట్టారు. అయితే ఇంతలోనే మహమ్మారి కరోనా వైరస్ రావటంతో.. చాలా వరకు విద్యా విధానం ఆన్ లైన్ కావటంతో..ఈ క్రమంలో గిరిజన ప్రాంతంలో ఉన్న విద్యార్థులు.. ఆన్ లైన్ విద్యా విధానం విషయంలో… అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న తరుణంలో.. సరైన నెట్ వర్క్, సిగ్నల్ లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో… గిరిజన విద్యార్థుల కోసం జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవటం జరిగింది.
ఈ క్రమంలో రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో 1529 జియో టెలికామ్ టవర్లను ఏర్పాటు చేయడానికి పూనుకుంది. అరకు లోయ, బొర్రా గుహలు, లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు, పాడేరు, చింతపల్లి, మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతీగల.. ఇంకా పలు గిరిజన ప్రాంతాలలో హైస్పీడ్ 4జి సేవలు.. అందించడానికి జగన్ ప్రభుత్వం రెడీ అయ్యింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో గిరిజన ప్రాంతంలో ఉండే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.