వాహనాలు తీసుకోవాలనుకునే వారికి ఒకటే సందేహం.. ఎలక్ట్రిక్ తీసుకోవాలా.? పెట్రోలా..? డీజిలా…? అనే ఆలోచనలు మొదలవుతాయి. అటువంటి సందేహాలకు బ్రేకులు వేసేలా ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది..!
ఏపీలో 400 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ను ఇన్స్టాల్ చేయడానికి ప్రతిపాదన తీసుకొచ్చారు.నేషనల్ హైవేస్ లో ప్రతి 25 కిలోమీటర్లకి ఒక ఛార్జింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేయనుంది. ఇక ప్రజలు ధైర్యంగా 2 వీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్లను కొనవచ్చు. ఈ ఛార్జింగ్ స్టేషన్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా గ్రామ, వార్డుసచివాలయ ఉద్యోగులకు ఎలక్ట్రికల్ వాహనాలను ఇవ్వనున్నట్లు తెలిపింది.
టి.టి.డి చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్ ట్రయిల్ రన్ చేశారు.అది విజయవంతం కావడంతో ఇక తిరుపతిలో కూడా పొల్యూషన్ తగ్గించనున్నారు.అయితే ఎలక్ట్రికల్ బస్ లను నేరుగా కొనటం లేదు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బసులనే రెటరో ఫిట్ ప్రాసెస్ చేసి ఎలక్ట్రికల్ బస్ గా కన్వెర్ట్ చేస్తున్నారు. వీర వాహన ఉద్యోగ కమిటీ వారు డీజిల్ ఇంజిన్ తీసేసి ఎలక్ట్రిక్ మోటారును ఫిట్ చేస్తన్నారు.
ఐథెర్ (AITHER):
కంపెనీ వాళ్ళు ఏకంగా 11 ఛార్జింగ్ స్టేషన్లు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. వినియోగదారులందరికి ఉచితంగా సేవలు అందింస్తుంది.అయితే వచ్చే సంవత్సరం నుంచి చార్జీలు వసూలు చేయనుంది.
కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ నగరంలో తొలి విడతగా 40 ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇతర మునిసిపాలిటీల్లో ఈ- స్వచ్ ఆటోలను ప్రెవేశపెట్టనుంది.ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేకంగా మియాపూర్-2, కంటోన్మెంట్ డిపోలలో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఒక్కో చార్జింగ్ స్టేషన్లో ఒకేసారి 10 నుంచి 12 బస్సులకు చార్జింగ్ పెట్టే వీలుందన్నారు. ఒక బస్సును 4 గంటలు చార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్లు వరకు తిరుగుందని తెలిపారు.
ముఖ్యంగా విజయవాడను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకే ఈ ప్రయత్నమని అధికారులు అంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు పూర్తిగా బ్యాటరీల సహాయంతో నడుస్తాయి. ఈ బ్యాటరీలకు దాదాపు నాలుగు గంటల పాటు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం విజయవాడ బస్ స్టేషన్ గ్యారేజీలోనే తాత్కాలికంగా ఈ బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 47 సీట్లతో నడిచే ఈ బస్సులలో సీసీ టీవి కెమెరాలు కూడా ఉంటాయి. ఈ బస్సు ఖరీదు దాదాపు 3 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం దాదాపు 80 లక్షల రూపాయలను ఒక్కో బస్సుకి సబ్సీడి ఇవ్వనుంది.