ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు సహాయపడేందుకు, రైతులకు భరోసా కల్పించేందుకు మరో అడుగు ముందుకేసింది. రైతుల కోసం ప్రవేశపెట్టనున్న జనతా బజార్ విషయంలో మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
రైతులతో పాటు ఆక్వా రైతులు కూడా జనతా బజార్ లో అమ్మకాలు చేయవచ్చని తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త నిర్ణయాన్ని తెలిపింది. పాత పల్లె వెలుగు బస్సులను జనతా బజార్ బస్సులుగా మార్చనున్నట్లు ప్రకటించింది. పాతబడి ప్రజా రవాణాకు పనికిరావనిపించిన బస్సులను రీమోడల్ చేసి జనతా బజార్ మార్కెట్ కు అనుగుణంగా రూపాంతరం చేస్తారన్నమాట. ఇవి ముఖ్యంగా పల్లెల్లో అందుబాటులో ఉంటాయి. దీనికి జగన్ వైఎస్సార్ జనతా బజార్ ప్రాజెక్ట్ అని నామకరణం చేసిన విషయం తెల్సిందే.