మూడు రాజధానుల వ్యవహారంలో జగన్ వెనక్కు తగ్గుతారా?? కరోనా తర్వాత పరిపాలన అంతా విశాఖపట్నం తరలి పోతుందా?? బిజెపి నాయకులు చెబుతున్నట్లు ఎప్పటికీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండబోతుంద?? ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అంటూ గళం విప్పిన జగన్ తర్వాత ఎందుకు మిన్నకుండిపోయారు?? నిజంగానే హైకోర్టు వ్యాఖ్యల వల్ల జగన్ పునరాలోచనలో పడ్డార?? అసలు మూడు రోజుల తరలింపు ఎప్పుడు?? ఇది సాధ్యమా సాధ్యం కాదా అనే ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నిత్యం తొలిచే ప్రశ్నలు. అసలు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి సమస్య ఏంటి? జగన్ చేసింది కచ్చితంగా తప్పేనా? రాజధానుల తరలింపు పరిపాలన అంశాలను కావాలని జగన్ పెద్దవి చేసుకున్నారా?? అంటే చాలా విషయాలు బయటకు వస్తాయి.
** మూడు రాజధానులు అంశం పై జగన్ శాసనసభ తీర్మానం చేయించడమే పెద్ద సమస్య అయింది. చట్టసభల్లో తీర్మానం మీద కోర్టు కలగ చేసుకోవచ్చు. దీంతో ప్రతిపక్షాలు వెంటనే హై కోర్టు మెట్లెక్కాయి. దీంతో ప్రభుత్వ వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం, అవి తర్వాత కోర్టు వాయిదాల్లో ఉండిపోవడం జరిగింది. అసలు ఇంత హడావుడికి జగన్ కారణామనేది న్యాయ, రాజకీయ నిపుణుల మాట.
** ఒక రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలి అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. దానికి రాజ్యాంగంలో సైతం ఇదే విధమైన అంశం ఉంది. ప్రభుత్వం తనకు అనువుగా ఉన్న చోట పాలన సాగించవచ్చు. వివిధ ప్రాంతాల్లో వివిధ కార్యలయాలు సౌలభ్యం పేరుతో తెరుచుకోవచ్చు.
** అదే పేరు మీద జగన్ చాలా సైలెంట్ గా రాజధానిని (పరిపాలన) విషయాన్నీ విశాఖపట్నం తరలిస్తే పెద్దగా సమస్య ఉండేది కాదు. కొన్ని విషయాల వల్ల, రాజధాని లోని కొన్ని కార్యాలయాలు సాగర తీరం తరలించమని చెప్పుకున్న సమస్య ఉండేది కాదు. జగన్ దీనిపై శాసన సభలో తీర్మానం చేయించండం వల్లనే ప్రస్తుత సమస్యలు వచ్చాయానేది నిపుణులు చెబుతున్న మాట.
** రాజధాని విషయాన్నీ జగన్ రాజకీయంగా వాడుకోవాలని భావించడం వల్లనే చట్ట సభల్లో తీర్మానం చేయించి, దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే మంచి ఇమేజ్ వస్తుందని భావించడం వల్లనే సమస్య వచ్చింది. కేవలం కొన్ని కార్యాలయాలను సైలెంట్ గా తరలిస్తే ప్రజలకు దీని మీద అంత దృష్టి ఉండదనే కోణంలో, పార్టీకి తనకు ఇమేజ్ రాదు అన్న కోణంలో మూడు రాజధానుల విషయాన్నీ జగన్ పెద్దది చేసారని వ్యాఖ్యనిస్తున్నారు.
** బీజేపీ ఇప్పుడు ఈ విషయం తన ఖాతా లో వేసుకునేలా పావులు కడుపుతోంది. అమరావతి ని రాజధానిగా ఉంచడానికి అది ప్రయత్నం చేస్తోంది. అయితే ఆ క్రెడిట్ మాత్రం మొత్తం తన ఖాతాలో వేసుకునేలా గేమ్ ఆడటం బీజేపీ వ్యూహం. దీనికి అన్నీ వైపులా గిరి గిస్తుంది.
** ప్రస్తుతం కోర్టుల బాధలో పడిన రాజధాని తరలింపు విషయంలో జగన్ ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది. ఒకవేళ రాజధానులు తరలింపు పై వెనక్కు తగ్గితే వైస్సార్సీపీ ప్రభుత్వానికి దెబ్బె. మరోసారి జగన్ వెనకడుగు వేశారని ప్రతిపక్షం చెప్పుకునేందుకు వీలు ఇచ్చినట్లు అవుతుంది. అలా కాకుండా ముందుకు వెళ్తే కోర్టు వ్యవహారాల్లో నిత్యం సతమతం అవుతున్న జగన్ దీనిలో ఇంకెన్ని ఎదురు దెబ్బలు తినాలో అర్ధం కానీ పరిస్థితి ఉంది.. అయితే మొదటే జగన్ సైలెంట్ గా రాజధాని తరలింపు విషయాన్నీ చక్కబెట్టుకు ఉంటే బాగుండేదని, దానిపై తర్వాత అయినా తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటే పోయేదాని సొంత పార్టీ నేతల నుంచే వ్యాఖ్యలు వస్తున్నాయి…. అన్నీ అనుకున్నట్టు… లెక్కలో చేస్తే జగన్ ఎందుకు అవుతాడు మరి…