Jagan : మామూలుగా రాష్ట్రానికి ఎవరైనా కొత్త ముఖ్యమంత్రి వస్తే మాజీ ముఖ్యమంత్రి తో అతనిని పోల్చడం సహజమే. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది. అయితే జగన్ కు, చంద్రబాబుకు మధ్య ఎంతో వ్యత్యాసం చాలా ఉన్నట్లు అనేక మంది అభిప్రాయపడుతున్నారు. తాజాగా సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరును మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోల్చి చూస్తున్నారు పరిశీలకులు.
భారీ వ్యత్యాసమే….
జగన్ ఎక్కువగా మీడియాకు దూరంగా ఉంటారని…. చెప్పింది చేస్తారని అనవసరంగా డప్పు కొట్టుకునే బాపతి కాదని కామెంట్లు వస్తున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు మాత్రం చెప్పేది ఎక్కువ… చేసేసి తక్కువ…. గంటలకు గంటలు మీడియా వారిని కూర్చోబెట్టి తినేస్తారు అనే ముద్ర అటు పార్టీ వర్గాలతో పాటు ఇటు ప్రజల్లో కూడా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ నాయకులను పోలుస్తూ సరికొత్త చర్చ జరుగుతోంది.
Jagan : పేదల పై వడ్డీలు, రుణాల భారం!
వివరాల్లోకి వెళితే…. రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ) టిడ్కో 88 మున్సిపాలిటీల పరిధిలో జి ప్లస్ త్రీ విధానంలో గృహ సముదాయాలు నిర్మించింది. అలాగే ఇల్లు ధరలో 2.5 లక్షల రూపాయలు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని…. లబ్ధిదారులు ఏళ్ళతరబడి ప్రతినెల వడ్డీ చెల్లించాలి అని తెలిపింది. అలా 1,43,600 యూనిట్ల నిర్మాణం జరిగింది. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
బాబుది బిజినెస్ అయిపోయే….
ఇది చంద్రబాబు ప్రభుత్వం లో జరిగింది. అయితే సదరు రుణాలను మాఫీ చేస్తే మంచిదని ప్రభుత్వం అప్పట్లో ఆలోచించింది కాని దీనిని పెద్దగా ప్రచారంలోకి తీసుకొని రాలేదు. చివరికి బాబు పేదలను అడ్డుపెట్టుకుని బిజినెస్ చేస్తున్నారని వ్యాఖ్యలు బయటికి వచ్చాయి. ఇప్పుడు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి విషయానికి వస్తే…. గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అమల్లో పెట్టారు.
Jagan హీరో అయిపోయే…
300 ఎస్ఎఫ్టి విస్తీర్ణంలో ఇళ్లుల్లో వుండేందుకు సిద్ధపడ్డారు అంటే… ఆ లబ్ధిదారులు అంతా పేదవారిని… అటువంటి నిరుపేదల పై రెండు లక్షలకు పైగా రుణాన్ని మోపడం భావ్యం కాదని లబ్ధిదారులకు ఇళ్లకు కేవలం ఒక్క ఒక్క రూపాయికే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే వైసిపి హయాంలో బ్యాంకు రుణం కూడా లేదు. ఎటువంటి వడ్డీలు ఉండవు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద 500 రూపాయలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.ఎవరైనా 500 చెల్లిస్తే ఆ మొత్తం వెనక్కి కూడా వచ్చేస్తుంది. కేవలం రూపాయి చెల్లించి 320 ఎస్ఎఫ్టి ఇంటిని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీనివల్ల 3812.58 కోట్ల రూపాయల ప్రయోజనం జరగనుంది.
అయితే గతంలో చంద్ర బాబు కూడా ఇదే ఆలోచన చేశారు కాని జగన్ సాహసం చేశారు. అప్పుడు బాబు వెనక్కి తగ్గడమే కాకుండా మీడియా ముందు గొప్పలకి పోయారు… చివరికి అందరి ఆగ్రహానికి గురయ్యారు, జగన్ మాత్రం కామ్ గా తన పని తాను చేసుకొని హైలైట్ అయిపోయాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?