Jagan: ప్రస్తుతం ఏపీలో హాట్ న్యూస్ ఏదన్న వుంది అంటే, అది సినిమా టిక్కెట్ల వ్యవహారమే అని చెప్పుకోవాల్సిన పనిలేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో సహా టాలీవుడ్ అగ్రహీరోలు, దర్శకులతో భేటి అయిన ఏపీ సీఎం జగన్ టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి ఓ మార్గం చూపారు. అయితే ఈ మీటింగులో ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడు అయినటువంటి మంచు విష్ణు అండ్ ఫామిలీ రాకపోవడాన్ని అందరూ గమనించారు. దాంతో పలు పుకార్లు కూడా సోషల్ మీడియాలో షికారు చేసాయి. మంచు ఫ్యామిలీని జగన్ పట్టించుకోలేదు అన్న వార్తలు చెలరేగాయి.
Shalini Pandey: బ్యాక్ అందాలతో మైండ్బ్లాక్ చేస్తున్న `అర్జున్ రెడ్డి` భామ.. నెట్టింట పిక్స్ వైరల్!
Jagan: తాజా సంకేతం దేనికి సూచిక?
ఇక ఈ క్రమంలోనే మోహన్ బాబు, మంచు విష్ణు మానసికంగా బాధపడ్డారని ప్రచారం కూడా జోరుగా సాగింది. ఇప్పటికే చిరంజీవిని ఒకసారి మంచు విష్ణు అవమానించేలా మాట్లాడటం మనం గమనించాం. చిరంజీవి జగన్ ను కలిసింది వ్యక్తిగత వ్యవహారమని చాలా తేలిగ్గా కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి – జగన్ కలయిక అనేది టాలీవుడ్ బాగు కోసమేనని మంత్రి పేర్ని నాని చెప్పడంతో విష్ణు అవాక్కయ్యాడు. తాజాగా ఏం జరిగిందో కానీ.. సడెన్ గా ఏపీ మంత్రి పేర్ని నాని.. మోహన్ బాబు ఇంట్లో ప్రత్యక్ష మయ్యారు.
AP Minister Seediri Appalaraju: మంత్రి సీదిరికి పోలీస్ షాక్..! జగన్ సీరియస్ ఆదేశాలు..!
కంటితుడుపు చర్యా?
ఈరోజు మంత్రి పేర్ని నాని హైదరాబాద్ కు వచ్చి మరీ మంచు మోహన్ బాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సినీ దిగ్గజాలంతా జగన్ దర్శనం కోసం హైదరాబాద్ నుంచి అమరావతి వెళితే.. ఇపుడు ఏకంగా ఏపీ మంత్రే మోహన్ బాబు ఇంటికి రావడం వెనుక ఏమైయుంటుందా అని పలువురు పరిశీలిస్తున్నారు. మోహన్ బాబును జగన్, పేర్ని నాని విస్మరించారన్న విమర్శలకు సమాధానమే ఈ కలయిక అంటూ కొంతమంది చెబుతున్నారు. కొంతమంది ఇది కేవలం కంటితుడుపు చర్యలాంటిదని కొట్టిపారేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?