JAGAN: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా విధానాన్ని సమూలంగా మార్చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇంగ్లీష్ విద్యను కూడా అందిస్తోంది. “జగనన్న విద్యా కానుక” పథకానికి శ్రీకారం చుట్టి నిరుపేదలు కూడా విద్యను అభ్యసించేలా ప్రోత్సహిస్తోంది. నాడు నేడుతో ఏపీ విద్యా వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకు పోతోంది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకుంటున్న 42,34,322 మంది స్టూడెంట్లకు విద్యా సంబంధిత వస్తువులను అందిస్తోంది. మొత్తం ఏడు రకాల వస్తువులను కిట్ల రూపంలో అందిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల భారాన్ని తగ్గిస్తోంది.
BREAKING : 50వేల మందికి రాత్రికి రాత్రి గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్!
మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచడంతోపాటు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మార్కులు సాధించడమే లక్ష్యంగా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకటో తరగతి విద్యార్థి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక స్కూలు ఇట్లు అందిస్తూ ఆదర్శనీయంగా నిలుస్తోంది. అయితే 2021–22 విద్యా సంవత్సరం కోసం జగనన్న విద్యాకానుక పథకం కింద కిట్లకోసం రూ.731.30 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా.
Teenmar Mallanna arrest: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన చిలకలగూడ పోలీసు..! ఆ కేసులో నంట..?
అయితే ప్రభుత్వ స్కూల్లలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొన్ని పాఠశాలల్లో 100 శాతానికి పైగా విద్యార్థుల సంఖ్య పెరిగిందని సమాచారం. దాంతో ఈ ఆర్థిక సంవత్సరానికి సరిపడా కిట్లు అందించేందుకు రూ.57.92 కోట్లు అదనంగా కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఇక తాజాగా ఈ విద్యా సంవత్సరానికి మొత్తంగా రూ.789.22 కోట్లను మంజూరు చేసింది. పాఠశాలలు ప్రారంభమైన 16వ తేదీ నుంచే జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగనన్న విద్యా కానుక రెండో విడతలో భాగంగా ఆక్స్ఫర్డ్డి/పిక్టోరల్ డిక్షనరీలు, 3 జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తోంది ప్రభుత్వం.
BREAKING: ఎఫ్ క్లబ్ కు ఈడీ నోటీసులు.. ఆ క్లబ్ ఎవరిదో తెలుసా..!