అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్లు హజరు కావడం లేదు. విజయవాడలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ సిఎం కెసిఆర్ హజరయిన విషయం తెలిసిందే. ఇక్కడి ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఢిల్లీలో జరిగే మోది ప్రమాణ స్వీకారానికి వీరిద్దరు గవర్నర్ నర్శింహన్తో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్లాలని భావించారు.
మోది ప్రమాణ స్వీకారానికి దేశ విదేశాల నుండి అతిధులు వస్తున్నందున ఢిల్లీలో ఎయిర్ ట్రాఫిక్ భారీగా పెరిగిపోయిందని అధికారులు తెలిపారు. ఢిల్లీలో మధ్యాహ్నం 3.30గంటలకే ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
విజయవాడలోనే జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆలస్యం కావడంతో సమయాభావం కారణంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.