(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డేకి రాష్ట్రంలోని హైకోర్టు తీర్పులు, సుప్రీం కోర్టులోని ఒక న్యాయమూర్తిపై ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి లేఖ రాసిన వ్యవహారం బహిర్గతం కావడం పెద్ద దుమారమే లేపిన విషయం తెలిసిందే. మరో పక్క సుప్రీం కోర్టులోనూ ఏపి సీఎం జగన్ కు వ్యతిరేకంగా పిటీషన్ కూడా దాఖలు అయ్యింది. ఈ వ్యవహారంలో ఏపి సీఎం జగన్ వైఖరిని ఖండిస్తూ ఏపి బార్ అసోసియేషన్ అటు ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ లు ఖండించాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే. న్యాయవాద సంఘాల్లోనూ ఇప్పుడు రెండు వర్గాలు అయ్యాయి. ఒక వర్గం సీఎం జగన్ లేఖ రాయడం, దాన్ని బహిర్గత పర్చడం తప్పని వాదిస్తుండగా కొందరు న్యాయవాదులు లేఖ రాయడం తప్పుకాదని జగన్మోహనరెడ్డిని సమర్థిస్తున్నారు.
సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే కూడా అక్కడి అసోసియేషన్ చేసిన తీర్మానాన్ని విబేధించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరగాలి, విచారణ ద్వారానే ఆరోపణలో వాస్తవం ఉందా లేదా అనేది తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోపణలు అవాస్తవమని తేలితే ఫిర్యాదు చేసిన వారిపై దిక్కార చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని దుష్యంత్ దువే అన్నట్లు సమాచారం. మరో పక్క ఏపి హైకోర్టులోని పలువురు న్యాయవాదులు కూడా ఆదివారం సమావేశమై అసోసియేషన్ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించారు. జగన్మోహనరెడ్డి చర్యలను సమర్థిస్తూ ఆయన ఫిర్యాదుపై విచారణ జరగాలని పేర్కొన్నారు. పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు సైతం సీఎం జగన్మోహనరెడ్డి చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఆయన చర్యలను సమర్థిస్తున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తికి లేఖ రాయడం తప్పుకాదనీ అయితే రాసిన లేఖను బహిర్గతం చేయడం తప్పని పలువురు పేర్కొంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?