అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్మోహనరెడ్డి ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావైశంలో పార్టీ శాసనసభ్యులు జగన్మహనరెడ్డిని ఎకవాక్య తీర్మానంతో శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. సినియర్ నేత బొత్సా సత్యనారాయణ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారధి, ఆదిమూలపు సురేష్ బలపర్చారు. సమావేశంలో 150మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ, ఎంపిలు పాల్గొన్నారు.
సాయంత్రం నాలుగున్నర గంటలకు హైదరాబాదులో గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ను కలిసి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తీర్మాన ప్రతిని సమర్పించనున్నారు.
ఈ నెల 30వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.