ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ స్వర్ణ ప్యాలెస్ ఘటనకు ఏపీ ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేదు అన్నట్లు మాట్లాడారు. రమేష్ ఆస్పత్రికి మాత్రమే తాము ట్రీట్మెంట్ కు అనుమతి ఇచ్చామని.. కోవిడ్ సెంటర్ కు తమ దగ్గర ఏ పర్మిషన్ వారు తీసుకోలేదని మంత్రి నాని తెలిపారు.
స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన ప్రమాదంపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఒక కమిటీని నియమించాలని చెప్పిన నాని ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని తేలినట్లు తెలిపారు. ఇక దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరు అన్న విషయాన్ని తాము వదిలిపెట్టేది లేదని చెప్పారు.
ఈ ఘటనలో పది మంది మృతి చెందారని తెలిపిన నాని వెంటనే రమేష్ ఆస్పత్రి యాజమాన్యాన్ని మరియు షార్ట్ సర్క్యూట్ అయినందుకు బాధ్యులైన వారిని అరెస్టు చేయించే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలు కోవిడ్ సెంటర్లుగా హోటల్స్ ను లీజుకు తీసుకునేందుకు, అక్కడ పేషెంట్లు చేరడానికి వీలు లేదని చెప్పిన ఆయన.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని…. ఇప్పటి వరకూ వీటిని ఉల్లంఘించిన వారిని కూడా తక్షణమే అరెస్ట్ చేసి కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు.