ఒక రెండు నెలల క్రితం రాయలసీమ ఎత్తిపోతల పథకం పై జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం.. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుండి సంగమేశ్వరం వరకు రోజు మూడు టీఎంసీల నీటిని ఎత్తి వేయాలని జగన్ తీసుకున్న నిర్ణయంతో వారికి ఎంతో నష్టం కలుగుతుందని ….పైగా ఇది ముందు చేసుకున్న ఒప్పందాలలో భాగం కూడా కాదని కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేశారు. బోర్డు కూడా అటుఇటుగా తెలంగాణ వైపై మాట్లాడింది.
అయితే తుది నివేదిక వచ్చే వరకు…. కేంద్రం తల ఊపే వరకు ఎటువంటి పనులు చేపట్టకూడదని కృష్ణ బోర్డు ఆదేశించింది. ఇంకా కావాలంటే ప్రాజెక్టు డిపిఆర్ సమర్పించి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలని చెబుతోంది.
కానీ ఇప్పుడు ఉన్నట్టుండి జగన్ ఒక్కసారిగా ఎత్తిపోతల ప్రాజెక్టు కు రూ.3278.18 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. పనులు దక్కించుకున్న సంస్థ 30 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలని షరతు విధించారు.
దీంతో రాయలసీమ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కృష్ణ బోర్డుని కోరింది. ఈ మేరకు సోమవారం బోర్డుకి ఒక లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని… తెలంగాణ వాదిస్తుండగా జగన్ మాత్రం వారి మాటలను పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు హైకోర్టు నిర్ణయాలను ధిక్కరించి వ్యవహరించిన జగన్ ఇప్పుడు కృష్ణ బోర్డుకి ఎదురెళుతున్నాడు. అయితే ఇలా అథారిటీ లను కాదని ఏకపక్షంగా నిర్మాణం కోసం ముందుకు వెళ్తే ఎక్కడైనా ప్రక్రియ ఆగిపోతుందని… జగన్ సర్కార్ మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాలు వస్తున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?