ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్లాస్మా థెరపీపై బాగా అవగాహన కల్పించాలని అన్నారు.
అలాగే ఎవరైనా ప్లాస్మా దానం చేస్తే వారికి 5,000 రూపాయలు ఇవ్వాలని సూచించారు. వారి ఆరోగ్యానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని జగన్ అన్నారు. కోవిద్ నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే అది పరిస్థితి విషమించిన వారి విషయంలో ఉపయోగపడుతుంది. అందుకే ప్రభుత్వాలు ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తున్నాయి. ఇందుకోసమే 5,000 రూపాయలు ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రభుత్వాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. ఈ పద్దతిని కర్ణాటక అవలంబిస్తుండగా, ఇప్పుడు ఏపీ కూడా మొదలుపెట్టనుంది. ఇక ఆసుపత్రిలో బెడ్ల ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ప్ డెస్క్లో అందుబాటులో ఉంచాలని జగన్ అన్నారు.