ఏలూరు, ఫిబ్రవరి 17: వైసిపి అధికారంలోకి రాగానే బిసిల అభ్యున్నతికి ఎటా 15వేల కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయడం జరుగుతుందని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు.
వైసిపి ఆధ్వర్యంలో ఏలూరులో ఆదివారం బిసి సింహగర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా వైసిపి బిసి డిక్లరేషన్ను జగన్ ప్రకటించారు. భారతీయ నాగరికతలో అణువణువూ బిసిల పాత్ర కీలకమని జగన్ అన్నారు.
ప్రసంగంలో ప్రధాన అంశాలు..
- బిసిల అభివృద్ధికి ప్రతి ఏటా 15వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో 75వేల కోట్లు ఖర్చు చేస్తాం.
- సబ్ ప్లాన్ ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తాం
- కార్పోరేషన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం.
- నాయి బ్రాహ్మణులు, రజకులు, చేనేతలకు, మధ్యకారులు, బోయిలు, వాల్మీకులు, రజకులు, యాదవులు, షేక్లు తదితర బిసి కులాలకు 139 కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తాం.
- పాఠశాల విద్యార్థులకు 15వేలు, కళాశాల విద్యార్థులకు 20వేల రూపాయల వంతున చెల్లిస్తాం.
- బిసిల సమస్యల పరిష్కారానికి శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తాం
- సమావేశంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, వైసిపి సీనియర్ నాయకుడు బొత్సా సత్యనారయణ తదితరులు పాల్గొన్నారు.