ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మతాల పైన రాజకీయాలు జరుగుతున్నాయి అనే మాట వాస్తవం. ఈ తరహా రాజకీయాలను లక్ష్యంగా చేసుకొని అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఇక ఇలాంటి సమయంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీల ను ఇప్పుడు క్రైస్తవ మిషనరీల లాగా… బీజేపీ-జనసేన తెలుగుదేశం పార్టీలు టార్గెట్ చేస్తున్నాయని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా ఆ కూటమి వెళ్లి ముద్రగడ పద్మనాభం ను కలిసినంత మాత్రాన కాపుల ఓట్లు పడవు అని మండిపడ్డారు.
ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తున్న మత రాజకీయాలను నిరసిస్తూ బహిరంగ సభ నిర్వహిస్తామని కూడా తెలిపారు. గోదావరి జిల్లాలో కానీ అమరావతిలో గాని ఇది ఏర్పాటు చేసే అవకాశం ఉందని అన్న ఆయన జగన్మోహన్ రెడ్డి ఇ ముఖ్యఅతిథిగా దీనికి హాజరు కావచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక ఈ భారీ బహిరంగ సభలో కనీసం కోటి మంది ఉండేలా…. రాష్ట్ర రాజకీయాల్లో ఈ బహిరంగ సభ చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.