అమరావతి: ఏపీ రాజధానిని అమరావతి నుండి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సీఎం జగన్ సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అమరావతి నిర్మాణం అంశంపై జగన్ చర్చిస్తున్నట్లు సమాచారం. రాజధాని తరలింపుపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. రాజధాని తరలింపుపై టీడీపీ సహా విపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా రోడ్డుపై బైఠాయించిన ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సమీక్ష సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
previous post