ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ దూసుకుపోతున్నారు. పాదయాత్రలో అదే విధంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ దాదాపు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 90% వాగ్దానాలనూ ఏడాదిలోనే అమలు చేసిన ఘనత జగన్ సర్కార్ దక్కించుకుంది.
ముఖ్యంగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు ఆగిపోకుండా వైసీపీ ప్రభుత్వం అమలు చేయటంతో ప్రజలకు జగన్ సర్కార్ పై విశ్వసనీయత ఉన్న కొద్దీ పెరుగుతుంది. అందువల్లే దేశవ్యాప్తంగా బెస్ట్ సీఎం అని పలు ప్రముఖ సంస్థలు చేస్తున్న సర్వేలలో టాప్ ఫైవ్ లో ఉండేలా జగన్ సర్కార్ ర్యాంకులు సాధిస్తూ వస్తోంది.పాదయాత్రలో అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా పేదవాడి కోసం తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్క అడుగు వేస్తే తాను నాలుగు అడుగులు వేస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే పేదవాడికి కారంగా ఉండే విద్య ,వైద్యం విషయంలో కొన్ని సంస్కరణలు తీసుకు వస్తూ వైయస్ జగన్ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకోవటం మనకందరికీ తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా పేదవాడి కోసం మరో అడుగు వేయటానికి జగన్ సర్కార్ రెడీ అయింది. మేటర్ లోకి వెళ్తే సీఎం జగన్ ఈరోజు “జగనన్న జీవక్రాంతి ” పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయస్సు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేయనున్నారు. 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేసేందుకు రూ. 1868.63 కోట్లు వ్యయం ప్రభుత్వం ఖర్చు చేయనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. మూడు విడతలుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.