Ys Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇటీవల ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన క్రమంలో మూడు సంవత్సరాలలో గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని తీసుకురావాలని సూచించిన విషయం తెలిసిందే.
ప్రస్తుత ప్రపంచంలో చాలావరకూ “వర్క్ ఫ్రొం హోమ్” ద్వారా యువత ఉద్యోగాలు చేస్తూ మంచి రాబడి పొందుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న యువతకు ఆ తరహాలోనే ఉద్యోగాలు కల్పించే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తూ ఉంది. అంత మాత్రమే కాక గ్రామాల్లో ఇంటర్నెట్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ డిసైడ్ అయింది. ఇదిలా ఉంటే అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ గ్రామాల్లో ఉన్న యువతకు కల్పించాలని ఇదే రీతిలో విద్యావిధానం విషయంలో జగన్ సర్కార్ ఇంటి దగ్గర నుండి ఉపాధి పొందే రీతిలో విద్యార్థులకు అవగాహన కల్పించడానికి కూడా డిసైడ్ అవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బిఎ, బికాం వంటి ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీష్ మాట్లాడే తరహాలో పాఠ్య ప్రణాళికలను తయారు చేయాలని ఉన్నత విద్యామండలి అధికారులతో జగన్ భేటీ అయిన ఈ క్రమంలో సూచించినట్లు సమాచారం. పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చి తీరాలి అని, అప్పుడే పోటీ ప్రపంచంలో రాణించిన వారవుతారని పేర్కొన్నారు అంట. అదే రైతు అమ్మఒడి మరియు జగనన్న విద్యా దీవెన వంటి పథకాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు టాక్. ఏది ఏమైనా త్వరలో గ్రామాల్లో అందుబాటులోకి తీసుకు రాబోయే ఇంటర్నెట్..అన్ లిమిటెడ్ ప్యాక్ గా అందించే ఆలోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు టాక్.