ఏపీ సీఎం వైయస్ జగన్ డిసెంబర్ 25 వ తారీఖున దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఎప్పుడో చేయాలని భావించిన గానీ ప్రత్యర్థులు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అడ్డుపడుతూ వచ్చారు. అయితే సరిగ్గా డిసెంబర్ 25 వ తారీకు ముక్కోటి ఏకాదశి ముహూర్తం కారణంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఈ దివ్య ముహూర్తాన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించి పేదల లో సంతోషం నింపారు.
ఇదిలా ఉండగా సరిగ్గా ఇదే రోజు ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ విరుగుడు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయనున్నట్లు వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఆదేశాలు ఇస్తూ వాళ్లతో భేటీ అవుతూ ఉండటం జరిగింది.
దేశం లో వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటినుండి ఏపీలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ జగన్ సర్కార్ చాలా వరకు కంట్రోల్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కేంద్రం కూడా అంగీకరించడం జరిగింది. ఇదిలా ఉండగా సరిగ్గా డిసెంబర్ 25 వ తారీకు నాడు రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు 4762 ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ జరుగుతుంది. కోటికి పైగా టెస్టులు నిర్వహించి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్రం విజయం సాధించింది.” అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీంతో ఒకేరోజు ఒకపక్క పేదలకు ఇళ్ల పట్టాలు కార్యక్రమం మరోపక్క కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జగన్ సర్కార్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రజలలో ఆనందం నెలకొంది.