రాష్ట్రంలో బీడు బారిన భూములకు కూడా సాగునీరు అందించడమే లక్ష్యంగా జగన్ సర్కార్ వైయస్సార్ జలకళ పథకం ద్వారా ఉచిత బోర్లు ఇవ్వటమే కాక వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మొదట 120 మీటర్లు దాటకుండా బోరు వేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో రాయలసీమ అదేవిధంగా పల్నాడు గుంటూరు పరిసర ప్రాంతాలలో 120 మీటర్లు వేసినా కానీ నీళ్లు పడని పరిస్థితి.
దీంతో వైఎస్ఆర్ జలకళ అనే ఈ పథకం ఉద్దేశం దేనికి పనికిరాకుండా పోతున్న పరిస్థితి. ముఖ్యంగా బీడు భూములు రాయలసీమ అదేవిధంగా పల్నాడు రైతులు ఎక్కువగా ఉన్న తరుణంలో ఈ పథకం విషయంలో సవరణలు మరియు సరికొత్త మార్పులు తీసుకురావడానికి జగన్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాయలసీమ వంటి ప్రాంతాలలో 1200 నుండి 14 వందల మీటర్లు బోరు వేసిన నీళ్లు రాని పరిస్థితి.
దీంతో ఏ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతానికి అనుకూలంగా వైయస్సార్ జలకళ పథకాన్ని అమలు చేయాలనే, 120 మీటర్లు నిబంధనలు వంటివి పక్కనబెట్టి రీతిలో వైసీపీ ప్రభుత్వం తాజాగా బోరు బావి తవ్వే విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.