ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేవాలయాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి దేవాలయాలపై దాడులు విగ్రహాలు ధ్వంసం కావటంతో ప్రతిపక్షాలు మరియు అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా సరిగ్గా ప్రభుత్వ పథకాలు పెట్టే సమయంలో ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవటం ఇది పక్కాగా ప్రతిపక్షాల కుట్ర అని జగన్ ఇప్పటికే ఆరోపించడం మనకందరికీ తెలిసిందే.
కావాలని చంద్రబాబు అండ్ కో ఇటువంటి సంఘటనలు చేయించి అనుకూలంగా ఉన్న మీడియాతో రెచ్చగొట్టే విధంగా కథనాలు ప్రసారం చేస్తున్నట్లు జగన్ సర్కార్ ఆరోపించడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా దేవాలయాల విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాలను విషయంలో సిఐడి విచారణ కి జగన్ సర్కార్ ఆదేశించటం మనకందరికీ తెలిసిందే.
ఇలా ఉంటే చంద్రబాబు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా దేవాలయాలు ధ్వంసం కావడం జరిగింది. కాగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే జగన్ తిరిగి ఆ దేవాలయాలను పునర్నిర్మించడానికి సంబంధిత వారికి మాట ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పుడు బాబు హయాంలో కూల్లగొట్టిన ఆలయాలను నిర్మించడానికి జగన్ సర్కార్ రెడీ అయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పేరుగాంచిన ధ్వంసమైన ఆలయాలకు రేపు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇదే రీతిలో 70 కోట్ల రూపాయలతో దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. చంద్రబాబు హయాంలో దాదాపు నలభై ఆలయాలు కూల్లగొట్టడం జరిగింది. ఈ తరుణంలో త్వరలో 3,4 ఆలయాలకు శంకుస్థాపనకు జగన్ సర్కార్ రెడీ అవటంతో.. దేవాలయాల రాజకీయాల విషయంలో టీడీపీ శ్రేణులు వైసీపీ ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లే అని అంటున్నారు విశ్లేషకులు. జగన్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలో చాలా వరకు మత రాజకీయాల విషయంలో ఆగ్రహజ్వాలలు కొద్దిగా చల్లబడే అవకాశం ఉందని అంటున్నారు.