ఈ కరోనా సంక్షోభం కారణంగా ప్రజలతో పాటు ప్రభుత్వ ఆదాయం కూడా పూర్తిగా పడిపోయింది. ప్రజలకు ఆదాయం రావాలంటే వారికి పని ఉండాలి.. కాని ఇప్పుడు అది దొరకడమే గగనం అయిపోయింది. ఇక ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే ప్రజలు పని చేసే పన్నులు చెల్లించాలి. ప్రజలకి పనులు లేకపోయినా పన్నులు పెంచి మరీ ప్రభుత్వం వసూలు చేసి తగ్గిపోయిన ఆదాయాన్ని కవర్ చేసుకుంటుంది. ఏపీ సర్కార్ కూడా ఇప్పుడు అదే యోచనలో ఉంది.
తగ్గిన ఆదాయాన్ని పన్నులు పెంచి కవర్ చేసే దిశగా యోచిస్తోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పై ఇలాగే అధిక భారం మోపి దేశంలోనే అత్యధిక రేటుకు తీసుకొచ్చిన జగన్ సర్కారు రాష్ట్రంలోని భూముల ధరలను మెట్రో సిటీ లో రేంజ్ తీసుకెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. రాష్ట్రంలో భూములు మరియు ఆస్తుల విలువ ప్రభుత్వం పెంచితే దానికి తగ్గట్లు రిజిస్ట్రేషన్ ఫీజు భారం పడుతుంది. కొనుగోలుదారుల పై ఇది అధిక ప్రభావం చూపిస్తుంది. బహిరంగ మార్కెట్ లో ధరలు ఎంత ఉన్నా మార్కెట్ రేటు ప్రకారమే రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు. పరిస్థితిని బట్టి మార్కెట్ రేట్లను ప్రభుత్వం మారుస్తూ ఉంటుంది.
ఇక రియల్ ఎస్టేట్ భూమ్ లో ఉన్నప్పుడు భూములు, ఆస్తులు విలువ పెరుగుతుంది. లేనిపక్షంలో తగ్గుతాయి. అలాంటి పరిస్థితులు లేకుండా ప్రభుత్వం ఒక మార్కెట్ రేటు డిసైడ్ చేసి దాని ప్రకారం అధిక రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేస్తుంది. ఈ మార్కెట్ రేటు భారీగా పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఎప్పుడైనా రావచ్చు.
అధికారవర్గాలు మాత్రం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. ఇక సర్కారు అటు భూములతో పాటు ఇటు భవనాల రేట్లు కూడా ఇదే పద్ధతిలో ఒకేసారి పెంచనుందట.