ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 2004లో అధికార౦లో కొచ్చిన వెంటనే విద్య వైద్య రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు.
అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు.అలాగే ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయటంతో పాటు 108 అంబులెన్స్ సర్వీసుని కూడా అమల్లోకి తెచ్చారు.ఆరోగ్యశ్రీని కూడా ప్రవేశ పెట్టిన ఘనత రాజశేఖర్రెడ్డిది.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కూడా విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.అయితే ఈ విషయంలో ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని ఆదర్శంగా తీసుకున్నట్లు గోచరిస్తోంది.విద్యారంగం విషయంలో స్పష్టమైన విధానం గలిగిన జగన్ మోహన్ రెడ్డి మాజీ ఐఆర్ఎస్ అధికారి ఆదిమూలపు సురేష్ ని మంత్రివర్గంలో తీసుకుని ఆయనకు ఆ శాఖను కట్టబెట్టారు.విద్యాశాఖలో ఎలా ప్రక్షాళన చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న విషయంలో జగన్ కు కేజ్రీవాల్ దారి చూపించారు.ఇటీవలి ఎన్నికల్లో ఢిల్లీలో మళ్లీ కేజ్రీవాల్ ఘనవిజయం సాధించడానికి విద్యావ్యవస్థలో ఆయన ప్రవేశపెట్టిన మార్పులు దోహదపడ్డాయి.తన ప్రభుత్వ బడ్జెట్లో 25 శాతాన్ని విద్యారంగానికి ఆయన కేటాయించారు ప్రభుత్వ ఆధీనంలో నడిచే విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు కేజ్రీవాల్ భారీగా నిధులు ఖర్చు పెట్టారు.ఇప్పుడు పరిస్థితి ఎలా తయారయిందంటే ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలకే ప్రైవేటు స్కూళ్ల కన్నా డిమాండ్ ఎక్కువగా ఉంది.దీన్ని పరిగణనలోకి తీసుకున్న జగన్ అదే మార్గంలో నడుస్తున్నారు.మనబడి నాడు నేడు అన్న పథకాన్ని కింద ఆరు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడానికి జగన్ ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది.ఢిల్లీలో కేజ్రీవాల్కు వర్కౌట్ అయిన మాదిరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది జగన్కు ఓట్ల వర్షం కురిపిస్తుంటే వేచి చూడాలి.