ఏపీ రాష్ట్రానికి మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర వేసిన వెంటనే అధికారపక్షం జగన్ ను ఎత్తేసి చంద్రబాబు పై దుమ్మెత్తి పోశారు. నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి అమరావతి అజెండాతో తిరిగి గెలవాలని సవాల్ విసిరారు. ఇక టీడీపీ నేతలు కూడా రాజధాని పై రచ్చ చేశారు. అమరావతి లో పెట్టిన పెట్టుబడులను ఏం చేస్తారని… జనం సొమ్ము మరియు త్యాగం బూడిదలో పోశారని శాపనార్థాలు పెట్టారు.
ఇక ఇదే సమయంలో చంద్రబాబు ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నాడు అని అంతా అనుకుంటున్న సమయంలో కేవలం 24 గంటల్లో ఆటనే మార్చాడు బాబు. తను 40 ఏళ్ల రాజకీయ అనుభవం తో చంద్రబాబు ఇప్పుడు పరిస్థితులు తారుమారు చేసిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన చర్చకు దారితీసింది.
విషయం ఏమిటంటే గత 24 గంటల నుండి సోషల్ మీడియాలో కృష్ణ మరియు గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని… అమరావతి అంశాన్ని ప్రధానంగా తీసుకుని వారు జగన్ ముందుకు వెళ్లనున్నారని విపరీతమైన ప్రచారం జరిగింది.అసలు ఏం జరుగుతుందో వైసీపీ శ్రేణులు గ్రహించే లోపే ఈ న్యూస్ రాష్ట్రం మొత్తం విపరీతంగా పాకిపోయింది.
తీరా చూస్తే ఇదంతా ఒట్టి కట్టుకథ అని…. వైసీపీ నాయకులు ఎవరికి అటువంటి ఉద్దేశాలు లేవని బయటపడింది.అయితే ఇక్కడ అమరావతి ప్రజలకి ఇప్పుడు తమకు న్యాయం కోసం ఎవరి ముందుకు వెళ్లాలో అర్థం అయినట్లు అయింది. టిడిపి వారు చాకచక్యంగా సోషల్ మీడియా బలం తో అమరావతి ప్రజలకు, రైతులకు… తమ ప్రాంతంలోని వైసీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పినట్లయింది. ఒకసారి వారు తగులుకున్నారంటే మిగతా సంగతి టీడీపీ శ్రేణులు మరియు కేడర్ చూసుకుంటాయి. ఎంతైనా బాబు తెలివే తెలివి..!