విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మొండి గా వ్యవహరించి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒక్క స్థానంలో కూడా గెలవలేక పోయింది. ఒక్క స్పెషల్ స్టేటస్ విషయంలో మాత్రమే కాక కేంద్రం ఆదుకోవాల్సిన చాలా విషయాలకు సంబంధించి ఏపీ పై బిజెపి మొండి గానే వ్యవహరించటం మనకందరికీ తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి ప్రాజెక్టు పోలవరం విషయంలో కూడా కఠినంగా బిజెపి వ్యవహరించడం తో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ తీవ్ర అసహనం లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రకారం కేంద్రం పూర్తి చేయాల్సి ఉన్న తరుణంలో… పైగా విభజనతో కనీసం రాబడి లేని విధంగా రాష్ట్ర ఖజానా పరిస్థితి నెలకొన్న తరుణంలో కోత విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పోలవరం విషయంలో తాడోపేడో తేల్చుకోవడానికి జగన్ సర్కార్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఏ మాత్రం రాజీపడకుండా ప్రధాని మోడీ తో పోలవరం వ్యవహారంపై ఇప్పటికే ఏడు పేజీల లెటర్ జగన్ రాయటం జరిగింది. ఈ నేపథ్యంలో రాసిన లెటర్ కి సరైన సమాధానం రాకపోతే త్వరలోనే పోలవరం విషయంలో క్లారిటీ కోసం ఢిల్లీకి జగన్ బయలుదేర భోతున్నట్లు టాక్ నడుస్తోంది. మరోపక్క గత ఢిల్లీ పర్యటనలో ఎన్డీయేలో చేరల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ జగన్ కి ఆఫర్ ఇవ్వగా…. సున్నితంగా జగన్ తిరస్కరించడం మనకందరికీ తెలిసిందే. ఆ తర్వాత ప్రస్తుతం పోలవరం విషయంలో కేంద్రం మొండిగా వ్యవహరించే రీతిలో అడుగులు వేయటంతో.., ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా తాడోపేడో కేంద్రంతో తేల్చుకునే రావాలని జగన్ డిసైడ్ అయినట్లు అందుకే మరోసారి ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నట్లు వైసీపీ పార్టీలో టాక్.