కొద్దిసేపటి క్రితం భారత దేశంలోని ఎనిమిది రాష్ట్రాలలో 19 రాజ్యసభ సీట్లకు గాను ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నాలుగు సీట్లకు గానూ ఈ ఎన్నికలు జరగనుండగా అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 ఎమ్మెల్యే ల తో సంపూర్ణ విజయం సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
2014 లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఏపీ లో రాజ్యసభ సీట్ల కోసం ఎన్నికలు జరుగుతుండగా కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన ఓటు వేశారు. ప్రస్తుతానికైతే పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు మోపిదేవి వెంకటరమణ వంటి ప్రముఖుల పేర్లను జగన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వారితో పాటు ఆళ్ళా అయోధ్య రామి రెడ్డి మరియు పరిమల్ నత్వాని పేర్లను కూడా ఖరారు చేయడం జరిగింది.
వీరిలో లో మొదటి ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కాగా నత్వాని మాత్రం ముఖేష్ అంబాబీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇకపోతే గుజరాత్ రాష్ట్రానికి చెందిన నత్వాని…. రెండుసార్లు జార్ఖండ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.