వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు ఆకస్మిక మరణం తో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ముందుగా తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి జరగబోయే ఉప ఎన్నికలలో పాల్గొనకూడదని ప్రతిపక్ష పార్టీ టిడిపి భావించగా అదే సమయంలో బిజెపి పోటీకి ఉత్సాహ పడటంతో..ఏపీలో ఎన్నికల వాతావరణం అలుముకుంది.
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ టిడిపి కూడా పోటీకి రెడీ అయ్యి.. తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ని పోటీలోకి దింపుతుంది. ఇదే క్రమంలో బిజెపి పార్టీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ని కమలం పార్టీ అభ్యర్థిగా పోటీకి దింపే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా వైసిపి పార్టీ తరుపున తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కోసం పోటీ చేయటానికి చాలామంది ముందుకు వస్తున్నారు.
ఇదిలా ఉండగా తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవటం టార్గెట్ కాకుండా జగన్.. ఈ ఉప ఎన్నిక రిజల్ట్ తో దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా సరికొత్త వ్యూహాలు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నాయకులతో జగన్ చర్చించిన సమయంలో.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తిరుపతి పార్లమెంటు అభ్యర్ధిగా పోటీ చేసిన బల్లి దర్గాప్రసాదరావు 2.28 లక్షల ఓట్ల మెజారిటితో గెలిచారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నాము కాబట్టి ఈ ఎన్నికలలో పార్టీకి దాదాపు పది లక్షల ఓట్లు పడాలని జగన్ పార్టీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారట. ఒక విధంగా చెప్పాలంటే జరగబోయే తిరుపతి ఉప ఎన్నిక గెలుపు దేశంలోనే చరిత్ర సృష్టించాలనేది జగన్ టార్గెట్ గా అర్ధమైపోతోంది. ఈ విధంగా గెలిస్తే మాత్రం దేశంలో మరోసారి వైసీపీ పార్టీ పేరు మారుమ్రోగే టమే కాక అధికార పార్టీపై జనాల్లో వ్యతిరేకత లేదు అనేది వ్యక్తమవుతోందని జగన్ యొక్క ప్లానింగ్.