ఇటీవల కాకినాడ డిఆర్సి సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కి అదే విధంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. టిడ్కో ఇల్లు కేటాయింపుల విషయంలో అవినీతి జరిగిందని ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఆరోపిస్తూ విమర్శలు చేయక ఎమ్మెల్యే ద్వారంపూడి… సుభాష్ చంద్ర బోస్ చేసిన కామెంట్లను ఖండించారు.
ఎక్కడ అవినీతి జరిగిందో ఎవరు చేశారో వాటి వివరాలు బయట పెట్టాలని కోరారు. ఇదే క్రమంలో మోడలైన్ వంతెన నిర్మాణం విషయంలోనూ పిల్లి సుభాష్ చంద్రబోస్ అభ్యంతరం తెలపడం జరిగింది. ఈ వంతెన నిర్మాణం వల్ల కాకినాడ సిటీ లో పలు ప్రాంతాలు ముంపుకు గురవుతాయి అని అన్నారు. కాబట్టి వెంటనే వంతెన నిర్మాణాన్ని ఆపేయాలని పిల్లి తెలిపారు.
ఈ విషయంలో పిల్లి కి వ్యతిరేకంగా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యవహరించడంతో ఇద్దరి మధ్య వివాదం గట్టిగానే నడిచింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పార్టీలో వ్యవహరించడంతో ఈ విషయం జగన్ దాకా వెళ్లటం జరిగింది. దీంతో ఇద్దరిని పిలిచిన జగన్ గట్టిగానే సీరియస్ క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇలాంటి గొడవలు రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో వైసీపీ నేతల మధ్య ఉండటంతో… వాటిపై కూడా జగన్ కన్ను వేసినట్లు తెలుస్తోంది. పార్టీలు అధికారంలో ఉన్న నేతలు ఈ విధంగా ఒకరిపై ఒకరు వివాదాలు చేసుకుంటే పార్టీ కి బ్యాడ్ నేమ్ తీసుకురావడమే కాకుండా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉండటంతో, జగన్ ఇలాంటి పొరపాట్లు పార్టీలో మరోటి జరగకుండా ముందు జాగ్రత్త తీసుకుంటున్నట్లు సమాచారం.