రాజకీయంగా జగన్ కు పెద్దగా టెన్షన్స్ లేకపోయినా.. కరోనా మాత్రం భయంకరమైన టెన్షన్ పుట్టిస్తుందని అంటున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసుల సంఖ్యకి తోడు అధికారపార్టీ ఎమ్మెల్యేలు, వారి బంధువులు, ఐఏఎస్ లతోపాటు మరికొందతమంది ప్రభుత్వ అధికారులు కూడా ఈ వైరస్ భారిన పడుతుంటుండటం ఆందోళనకు గురిచేస్తుందంట.
విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస రావు, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ లకు ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చింది. ఇదే క్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడికి వైరస్ సోకింది. అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మనవడూ వైరస్ బారిన పడ్డాడు. అదేవిధంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు వైరస్ బారిన పడ్డారు. ఈ ముగ్గురూ రాష్ట్ర ప్రభుత్వంలో వేర్వేరు హోదాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ హోమ్ ఐసొలేషన్లో ఉన్నట్లు సమాచారం.
ఈ ముగ్గురే కాకుండా మరో ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులకు కూడా వైరస్ సోకిందనే వార్త అధికారుల్లో కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే ఓ అధికారికి కూడా పాజిటివ్ వచ్చింది. సచివాలయ ఉద్యోగుల్లో చాలా మందికి ఈ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే 15 మందికి వైరస్ సోకిందట. దీంతో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు భయాందోళన చెందుతున్నారు.
అక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే… ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక శాఖలను పర్యవేక్షించే అధికారి కూడా కరోనా బారిన పడటం.. ఆ వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ ను నిత్యం కలిసే అధికారి కూడా కావడంతో ఆందోళన మరింత ఎక్కువైందని అంటున్నారు!