Jagananna Thodu: ఏపి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించాల్సిన జగనన్న తోడు కార్యక్రమం వాయిదా పడింది. చిరు వ్యాపారులకు పదివేల వంతున వడ్డీ లేని రుణాలు అందించే పథకం జగనన్న తోడు. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ, కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Jagananna Thodu: ఫిబ్రవరి 28వ తేదీకి వాయిదా
జగనన్న తోడు కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి బుధవారం నిర్వహించతలపెట్టిన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర వైసీపీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?