రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పలేం!ఇప్పుడు మిత్రులుగా ఉన్న పార్టీలు విడిపోవచ్చు!
శత్రువులుగా ఉన్న పార్టీలు కలిసిపోవచ్చు!ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య ఇదే మనం చూశాం.2014లో మిత్రపక్షాలుగా పోటీ చేసిన టిడిపి బిజెపిలు 2019 లో శత్రువులు అయిపోయాయి!పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీది అదే పంధా.2014 లో పవన్ కళ్యాణ్ టిడిపి బిజెపి కూటమికి మద్దతు ఇవ్వడం తెలిసిందే. 2019 ఎన్నికలలో ఆయన ఈ రెండు పార్టీలను కాదని కమ్యూనిస్టులు బహుజన సమాజ్ పార్టీ తో కలిసి బరిలోకి దిగి భంగపడ్డారు. అయితే వెనువెంటనే తేరుకొని బిజెపితో మైత్రి కూటమి కట్టారు. మరోవైపు టిడిపి కూడా బీజేపీ స్నేహం కోసం తహతహలాడుతోంది.
ఇక బిజెపి ఏమో జనసేన తో పొత్తు కొనసాగిస్తూనే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీతో కూడా తెలియచేయాలని చెలిమి చేసే ప్రయత్నాలను చెలిమి చేసే ప్రయత్నాలు సాగిస్తోంది. వైసిపి సైతం కేంద్రానికి అన్ని విషయాల్లో పూర్తి అండదండలు అందిస్తోంది.ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్డీఏ లో చేరవలసిందిగా అమిత్ షా జగన్ కు ఆఫర్ఇచ్చినట్లు, అలా చేరితే, రెండు మూడు కేంద్ర మంత్రి పదవులు వైసిపి కి ఇచ్చేందుకు ఆయన అంగీకారం తెలిపినట్లు వార్తలు వచ్చాయి.ప్రస్తుతం ఇదే అంశంపై వైసిపి ఫోకస్ పెట్టిందట.
ఎన్డీఏ లో చేరినట్లయితే కేంద్ర సహకారం రాష్ట్రానికి పూర్తిగా ఉంటుందని ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చని జగన్ భావిస్తున్నారట.భావిస్తున్నారట ఇదే సమయంలో ఇదే సమయంలో రాష్ట్రంలో కూడా బిజెపితో కలిసి తెలుగుదేశం పార్టీని చావుదెబ్బతీయవచ్చునన్న లెక్కలు కూడా ఉన్నాయట. ఇదంతా బాగానే ఉంది కానీ అందరికన్నా ముందే బీజేపీకి మిత్రుడు గా మారిన జనసేనాని పవన్ కళ్యాణ్ ని కమలనాథులు ఏం చేస్తారు అన్నది తేలాలి. వైసిపి బిజెపి కలిస్తే పవన్ కళ్యాణ్ ఆ కూటమిలో ఉంటాడా? అసలు జనసేన బిజెపి పొత్తు కొనసాగితే ఆ గుడారంలో వైసీపీ చేరుతుందా అన్న విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది!అయినా రాజకీయాల్లో ఏదైనా సంభవమే! ఏం జరుగుతుందో చూడాలి.