జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్యాయంగా చూసుకుంటే ఐదేళ్ల కిందట అమరావతిలో రాజధాని కోసం తెలుగుదేశం ప్రభుత్వం భారీగా భూములు సమీకరిస్తున్నప్పుడే రైతుల తరఫున నిలబడ్డారు. అప్పుడు భూములను ఇస్తున్న రైతుకి భరోసా ఏంటి అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
తెలుగుదేశం ప్రభుత్వానికి ఆయన మద్దతుదారు అయినప్పటికీ భూసేకరణ విషయంలో తప్పులు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్లి రైతులను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇందులో ఎవరైనా కచ్చితంగా మెచ్చుకోవాలి.ఇదే సమయంలో జనసేన అధ్యక్షుడు రైతులను ఉద్దేశించి 2015 ఆగస్టు 23న అమరావతి లో మాట్లాడుతూ “వేల మంది రైతులు వాళ్ల నమ్మకాన్ని, భవిష్యత్తును,, వారి పిల్లలను వారి తర తరాల భవిష్యత్ ను తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ ని నమ్మి అమరావతిలో పెడుతున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే…
అప్పుడు మంత్రి నారాయణ గారు ఉండరు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు ఉండరు. అప్పుడు భూములిచ్చిన రైతులకు న్యాయం చేసేందుకు రాజ్యాంగపరమైన భద్రత ఏముంది…? కీడెంచి మేలెంచమన్నారు కదా…? మరి దీనికి సమాధానం ఏమిటి?” అని ప్రశ్నించారు.అప్పుడు అమరావతి విషయం పై వైసీపీ అజెండా అందరూ అనుకుంటున్నట్లు మరీ అంత అనుకూలంగా ఏమీ లేదు. వారు కేవలం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోని జిల్లాల మధ్య చిచ్చు పెట్టడం తమకు ఇష్టం లేదని చెప్పారే గానీ తాము వస్తే అదే జిల్లాలకు న్యాయం చేకూర్చేలా… సమాంతరంగా వ్యవహరించబోమని కూడా ఎక్కడా చెప్పలేదు.
దీనినే పసిగట్టిన పవన్… అప్పుడు తెలుగుదేశం పార్టీని ఇదే విషయమై నిలదీశారు. అయితే అతను ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడం…. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైసిపి బంటుగా వ్యవహరించడం పవన్ కు పూర్తిగా పవర్ లేకుండా చేశాయి. అంతేకాకుండా అవకాశవాద రాజకీయాలు చేసే బిజెపిలో చేరడం కూడా ఇప్పుడు అతనికి పెద్ద మైనస్ అయిపోయింది. ఎటు చూసుకున్నా పవన్ మళ్ళీ రాజకీయాల్లో తనకంటూ ఒక పేరు సంపాదించి నిలదొక్కుకోవాలంటే కొత్త మార్గం వెతకాల్సిందే.