ఆంధ్ర ప్రదేశ్ లో కరొినా సోకిన ప్రజాప్రతినిధులు అందరూ చికిత్సనిమిత్తం ఏపిని వదిలి హైదరాబాద్ కి పరుగులు దిగటం విమర్శలకు తావిస్తోంది.ఇప్పటికే ఈ విషయం మీద దృష్టి పెట్టింది.
ఏపిలో కరోనా చికిత్స అధ్వాన్నంగా ఉండటంతోనే మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యులు రాష్ట్రం వదిలి హైదరాబాద్ కి వెళుతున్నారని చంద్రబాబు పోస్టింగ్ కూడా పెట్టేశారు.ఇది ముఖ్యమంత్రి జగన్ కి ఇబ్బంది కలిగించే అంశమే.ఏపీలో మంత్రులకు వరుసగా కరోనా సోకుతోంది. మొదటగా డిప్యూటీ సీఎం ఆంజాద్ భాషాకు సోకింది. ఆ తర్వాత బాలినేనిని కూడా సోకింది.వీరిద్దరూ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్కు కరోనా పాజిటివ్గా తేలింది. దాంతో హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో జాయినయి చికిత్స పొందుతున్నారు.
అధికారికంగా ప్రకటించకపోయినా వ్యవసాయ మంత్రి కన్నబాబుకు కూడా కరోనా సోకిందన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కేబినెట్ భేటీకి హాజరు కాలేదు. ఇక ప్రకాశం జిల్లాకే చెందిన వైసిపి ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీలో కొచ్చిన టిడిపి ఎమ్మెల్యే కరణం బలరామ్ మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుకూడా కరోనా బారిన పడి పొరుగు రాష్ట్రంలోనే చికిత్స పొందుతున్నారు.ఇలా వీరందరూ… కరోనా చికిత్స కోసం హైదరాబాద్కు పరుగులు పెట్టడం ఏపీ సర్కార్ పై విమర్శలు పెరగడానికి కారణంఅవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో కరోనా కు అద్భుతమైన చికిత్స ఉందని జగన్ ప్రభుత్వం పదేపదే చెబుతోంది.
అయినా వైసిపి ప్రజా ప్రతినిధులే ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రులను నమ్మకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు పరుగులు తీయటం,అక్కడ కరోనాకు చికిత్స చేయించుకోవడం ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు ఇస్తోంది. వారి ప్రాణాలు అయితే అంత గట్టివా?మావి అంత ఓటివా అని ప్రజలు గొణుక్కుంటున్నారు.వైసిపి ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి జగన్కు ఇబ్బందికరమనే చెప్పాలి!మంత్రులే ఆంధ్రప్రదేశ్లో చికిత్స బాగో లేదన్నట్లు పక్క రాష్ట్రానికి వెళ్లిపోతుంటే ముఖ్యమంత్రి ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటారో చూడాలి!అయినా ఆంధ్రప్రదేశ్లో లేనిది హైదరాబాద్లో ఉన్నది ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు! అయినా కరోనాతో చికిత్స ఎక్కడైనా ఒక్కటే !దాని కోసం ఆంధ్రప్రదేశ్ను వదిలి హైదరాబాద్కు ఎందుకు మంత్రులు వైసీపీ ప్రజాప్రతినిధులు పరుగులు తీస్తున్నారు అన్నది జవాబు దొరకని ప్రశ్న