ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ఏపీ రాష్ట్ర ప్రజలకు ఎంతో చేరువైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అతని సంక్షేమ పథకం అందుకోని వ్యక్తి ఉండడం గగనం అంటే అతిశయోక్తి కాదు. అన్నీ సామాజిక వర్గాలకు మరియు అన్ని ఎకనామిక్ క్లాసులు అతని నుండి చేయూత పొందాయి.
అయితే ఇప్పుడు జగన్ చివరికి తన మొదటి టార్గెట్ ఏమిటో బయట పెట్టేశారు. సీఎం జగన్ ఎక్కడా గందరగోళం లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉండగా రాష్ట్రంలో దాదాపు కోటి మంది మహిళలకు ఆసరాగా నిలవడమే తన టార్గెట్ అని… దాని కిందే వైఎస్సార్ చేయూత మరియు పథకాలను ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ నెల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఒక్కొక్కరి అకౌంట్లో 18 వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేయనుంది. వీరి సంఖ్య అటుఇటుగా ఒక 30 లక్షల వరకు ఉంటుంది. ఇలా అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో కనీసం కోటి మహిళలకు ముందుగా చేయూతనివ్వాలని వైఎస్సార్ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది.