అనంత్నాగ్ (జమ్ముకాశ్మీర్):జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో గురువారం ఉదయం ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఇద్దరుఉగ్రవాదులు మృతి చెందారు.
దక్షిణ జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పరిధిలోని అనంత్నాగ్ జిల్లా బాగేందర్ మొహల్లా వద్ద ఉగ్రవాదులున్నారనే సమాచారం తో పారామిలటరీ జవాన్లు దాడి చేశారు.
దీంతో ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు. జవాన్లు ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదుసు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్ధలంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
సంఘటన స్థలంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.