అమరావతి: గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న మేస్త్రీ నాగ బ్రహ్మాజీ కుటుంబానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరత లక్షలాది మంది కార్మికుల పొట్ట కొడుతోందని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న మేస్త్రి నాగ బ్రహ్మాజీ ఉదంతం తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. నాగ బ్రహ్మాజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
నాగ బ్రహ్మాజీ ఆత్మహత్య భవన నిర్మాణ కార్మికుల దయనీయ స్థితికి నిదర్శనమని పవన్ ఆరోపించారు. ఏపి ప్రభుత్వ అస్తవ్యస్థ ఇసుక విధానంతో రాష్ట్రంలోని 19,6 లక్షల మంది కార్మికులు నేరుగా ప్రభావితం కాగా మరో పది లక్షల మంది పరోక్షంగా ఉపాధి కోల్పోయారని పవన్ పేర్కొన్నారు. పనులు లేని కార్మిక కుటుంబాలు ఇప్పుడేం చేయాలో తెలియని స్థితిలో పడిపోయాయనని పవన్ అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికిపైగా కార్మికులు పడుతున్న ఇబ్బందులపై కేంద్రం దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
I appeal to ‘Central Govt’ to look into this and come to the rescue of 3 million plus construction workers.
— Pawan Kalyan (@PawanKalyan) October 27, 2019