హైదరాబాధ్, జనవరి 13: సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్న ప్రయాణికుల సౌకర్యార్థం ఆదివారం నుండి రైల్వేశాఖ జన్సాధారణ్ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్-విజయవాడ జనసాధారణ్ రైలు (నంబర్ 07192) సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నేటి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి విజయవాడకు రాత్రి 7.30 గంటలకు చేరుకుంటుంది. మరో రైలు (నంబర్ 07193) విజయవాడలో రాత్రి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటలకు నగరానికి చేరుకుంటుంది. సికింద్రాబాద్- విజయవాడ జన్సాధారణ్ (నంబర్ 07194) ప్రత్యేక రైలు మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి రాత్రి 7.10 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.విజయవాడ-సికింద్రాబాద్ రైలు (నంబర్ 07195) విజయవాడ స్టేషన్లో ఉదయం 8.35 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది.
దీంతోపాటు కాకినాడటౌన్- తిరుపతి జన్సాధారణ్ ప్రత్యేక రైలు(నంబర్ 07191) సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. విజయవాడ-విజయనగరం రైలు(నంబర్ 07184) రాత్రి 9.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు విజయనగరానికి చేరుకుంటుంది. విజయనగరం-విజయవాడ రైలు(నంబర్ 07185) విజయవాడలో ఉదయం 7.45 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.
జన్సాధారణ్ రైళ్లకు సంబంధించిన జనరల్ టికెట్ల ధరలను ప్రకటించారు. ఈ మేరకు సికింద్రాబాద్- విజయవాడకు 130 రూపాయలు, విజయవాడ-హైదరాబాద్కు 135 రూపాయలు, తిరుపతి-కాకినాడటౌన్కు 175 రూపాయలు, విజయవాడ-విజయనగరం 145 రూపాయలు, విజయనగరం-విజయవాడకు 145 రూపాయలుగా నిర్ణయించారు.
previous post
next post