Janasena: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామంలో ఇటీవల రహదారి విస్తరణ పేరుతో అధికారులు కొన్ని ఇళ్లను, ప్రహరీగోడలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామ రైతులు సహకరించారన్న రాజకీయ కక్షతోనే రహదారి విస్తరణ పేరుతో కూల్చివేతలు ప్రారంభించారని జనసేన ఆరోపించింది. రీసెంట్ గా ఆ గ్రామాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ క్రమంలోనే బాధితులకు జనసేన తరపున లక్ష చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు పవన్ కళ్యాణ్.
బాధిత కుటుంబాలకు ప్రకటించిన ఆర్ధిక సాయాన్ని ఈ నెల 27వ తేదీన జనసేన అధినేత పవన్ కళాణ్ అందజేయనున్నారని జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటం బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేస్తారని తెలియజేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ బీజేపీ కీలక నేతకు హైకోర్టులో బిగ్ రిలీఫ్